రెండు రోజుల్లో ముసాయిదా
నివేదిక ఫిబ్రవరి 2వ తేదీన
కేబినెట్ సబ్ కమిటీకి తుది
నివేదిక దేశానికే ఆదర్శంగా
నిలిచిన కులగణన అధికారులు,
ఉద్యోగులను అభినందించిన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ
దేశవిదేశాల్లోని బెస్ట్ పాలసీని
అధ్యయనం చేయాలి సమీక్షా
సమావేశంలో సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రా ష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దే శ వ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించిందని సిఎం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని ఆయ న చెప్పారు. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కం ట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సిం హ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగుల ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించా రు. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్లో
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదు
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని సిఎం చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిసి డెడికేటేడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయన్నారు. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నవంబర్ 6వ తేదీన రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే 2024) మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది.
ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహాయజ్ఞంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇళ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై
రికార్డు వేగంతో కులగణన అధికారం చేపట్టిన రెండునెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సిఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు అవసరమైన విధి, విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సారథ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది. అక్టోబర్ 9వ తేదీన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి, విధానాలతో జీఓ నెం.18 జారీ చేసింది.