Saturday, February 1, 2025

గద్వాల్ లో లారీని ఢీకొట్టిన బస్సు: ఒకరు మృతి… 40 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

గద్వాల్: జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పుల్లూరు టోల్ ప్లాజా వద్ద లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యుటర్న్ చేసుకుంటున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News