Monday, February 3, 2025

ప్రపంచకప్ గెలిచుకున్న టీమిండియాకు సిఎం రేవంత్‌రెడ్డి అభినందన

- Advertisement -
- Advertisement -

వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మలేషియాలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభతో అదరగొట్టే ఆటను ప్రదర్శించారని పేర్కొన్నారు.

దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారని అన్నారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారని అన్నారు. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. త్రిష మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News