- Advertisement -
హైదరాబాద్: సెకండ్ హ్యాండ్ ద్వి చక్ర వాహనాలు విక్రయించే ఒఎల్ఎక్స్ యాప్ ను ఆసరాగా చేసుకుని,టెస్ట్ డ్రైవ్ చేస్తామని, నమ్మించి బైకులను దొంగిలించే ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు.
నిందితులపై పలు మియాపూర్, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాదీనం పరుచుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని డిసిపి పేర్కొన్నారు.
- Advertisement -