- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. రెండు గంటలకు పైగా సమావేశమైన మంత్రివర్గం.. పలు అంశాలపై చర్చించింది. సమగ్ర కుల గణన నివేదికను, ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అసెంబ్లీలో పలు నివేదికలు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. కాగా, ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. క్యాబినెట్ సమావేశం దృష్ట్యా వాయిదా పడింది.
- Advertisement -