Saturday, February 8, 2025

ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో రెండో స్థానంలో భారత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలోనే 5వ స్థానంలో భారత్ ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం నిలిచిందని అన్నారు. కేంద్ర బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వివరించారు. 2047 వికసిత భారతఖ లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉండగా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన దేశంలోనే ఉందని స్పష్టం చేశారు. కోలిండియా బొగ్గు మంత్రిత్వ శాఖ చాలా కీలకమైన విభాగమని తెలిపారు. ఈ ఏడాది కోలిండియా స్వర్ణజయంతి ఉత్సవాలు జరుపుకుంటోందని తెలిపారు. కోలిండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని అన్నారు. పవర్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫెర్టిలైజర్, భారీ పరిశ్రమలు వంటి రంగాల్లో బొగ్గు కీలకమైన అంశమని తెలిపారు.

బొగ్గు ద్వారానే 74 శాతం విద్యుదుత్పత్తి
భారతదేశంలో బొగ్గు ద్వారానే 74 శాతం విద్యుదుత్పత్తి జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రానున్న దశాబ్దాల్లోనూ బొగ్గు ఒక కీలకమైన ఇంధనంగా ప్రత్యేకతను సంతరించుకుంటుందపి వివరించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే బొగ్గును నల్ల బంగారమని, కుకింగ్ కోల్‌ను బ్లాక్ డైమండ్ అని పిలుస్తారని తెలిపారు. దేశంలో వివిధ రంగాలకు బొగ్గు అత్యంత అవసరమైన ఇంధనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో సంస్కరణలు వచ్చాయని తెలిపారు. బొగ్గు రంగంలోనూ మౌలికమార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు తెలిపారు.

కోల్ బ్లాక్స్ వేలం విషయంలో పారదర్శకంగా వ్యవహరించామని అన్నారు. ఇప్పటివరకు 10 విడతల పాటు పారదర్శక వేలం పూర్తయి 184 బ్లాక్స్ వేల నిర్వహించినట్లు పేర్కొన్నారు. కమర్షియల్ కోల్ మైనింగ్, కోల్ గ్యాసిఫికేషన్, టెక్నాలజీ వంటి వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. భారత బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవసరం మేరకు నిర్ణయాలు తీసుకుని పారదర్శకంగా వాటిని అమలు చేయడం వల్లే ఉత్పత్తి పెరిగిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2023-.24లో 998 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని చెబుతూ 2014లో ఇది కేవలం 609 కోట్ల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగిందని గుర్తు చేశారు. బొగ్గు రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరిగిన తర్వాత మరింత పోటీ పెరిగిందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News