- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో ఆదివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కులో మావోయిస్టులు, భద్రత బలగాలు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం డిఆర్ జి, ఎస్ టిఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఎకె 47 లను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -