- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 70,169 మంది భక్తులు దర్శించుకోగా 24,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.33 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -