Thursday, February 13, 2025

సచివాలయంలో కూలిన పెచ్చులు.. దెబ్బతిన్న వాహనం

- Advertisement -
- Advertisement -

సచివాలయంలోని ఆరో ఫ్లోర్ సౌత్ భాగంలోని పట్టీ (పిఓపి పెచ్చులు) ఊడిపడ్డాయి. సిఎం చాంబర్ అంతస్తు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పిఓపి పార్టిషన్ కూలడంతో రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం దెబ్బతింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడడంతో పెను ప్రమాదం తప్పింది. పిఓపి పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి అందరినీ దూరం పంపించారు. పట్టీ మొత్తం కూలే అవకాశం ఉండడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటికే సచివాలయంలో అక్కడక్కడ వాటర్ లీకేజీ అవుతుండడంతో గోడలు పెచ్చులూడు తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే నిర్మించిన తెలంగాణ సచివాలయం పిఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణానికి రూ.1200 కోట్ల ఖర్చు కాగా, ఈ నిర్మాణం నాసిరకం అంటూ అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సచివాలయం ప్రారంభం రోజే అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణంపై విమర్శలు చేశారు.

ఊడి పడింది జిఆర్‌సి ఫ్రేం మాత్రమే: షాపూర్ జి పల్లోంజీ
సచివాలయంలో పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్ జి పల్లోంజీ స్పందించింది. నిర్మాణ సంస్థ రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ వర్క్‌లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఎలాంటి సమస్య లేదు. అది కాంక్రీట్ వర్క్ కాదు. స్ట్రక్చర్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఊడి పడింది జిఆర్‌సి ఫ్రేం మాత్రమేనని ఈ సంస్థ తెలిపింది. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జిఆర్‌సి డ్రిల్ చేస్తున్నామని, డ్రిల్ చేస్తే జిఆర్‌సి డ్యామేజ్ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుందని, ఎలాంటి నాణ్యత లోపం లేదని, తాము ఈ సంఘటనపై సమీక్ష చేస్తున్నామని షాపూర్ జి పల్లోంజీ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News