హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసు లో మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరయ్యా రు. కొండా సురేఖ గురువారం నాంపల్లి స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జి ముందు విచారణకు హాజరయ్యారు. బిఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ కెటిఆర్తో పాటు నాగార్జున కుటుంబంపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్య విడిపోయేందుకు కారణం కెటిఆరేననని కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరో నాగార్జున, కెటిఆర్లు వేర్వేరుగా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దాఖలు వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుం బాన్ని ఎంతగానో బాధించాయని.. సినిమా ఇండస్ట్రీలో ఏళ్లుగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమలాంటివారిపై ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల తమ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో ఇప్పటికే కోర్టులో తమ వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసిన న్యాయవాది ఆ వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన తర్వాత ట్విట్టర్లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని తెలిపారు. మంత్రి పెట్టిన పోస్టును ధర్మాసనానికి చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం ఎంతో కుంగిపోయిం దని, ఖచ్చితంగా ఆమె క్రిమినల్ చర్యలకు అర్హురాలని అశోక్ రెడ్డి వాదించారు. ఈ కేసులలో నాగార్జున సహా కెటిఆర్, సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్న కోర్టు మంత్రి కొండా సురేఖను కూడా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది.
ఈ నేపధ్యంలో కొండా సురేఖ, తన లాయర్ గురుప్రీత్ సింగ్తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని ఆమె తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే మీడియా ముఖంగా ఆమె చేసిన విమ ర్శలకు, కోర్టుకు సమర్పించిన వివరాలకు పొంతన లేదని నాగార్జున తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.