Wednesday, April 2, 2025

మహాశివరాత్రి భక్తులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపాలని ఆర్‌టిసి నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాస గృహంలో మహా శివరాత్రి సందర్భంగా ఆర్‌టిసి బస్సు సర్వీసుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు నడపాలని

మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని సూచనలు చేశారు. బస్ స్టాండ్‌ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్‌టిసి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎండి సజ్జనార్, ఈడి మునిశేఖర్, సిటిఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News