కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం బ్యూరో: రాష్ట్రానికి ఈ నెలలో రావాల్సిన యూరియాను వెంటనే ఇతర కంపెనీల ద్వారా సరఫరా చే యాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుక్రవారం కేంద్ర రసాయనాలు, ఎరువు ల శాఖ మంత్రికి లేఖ రాశా రు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సరఫరా చేసేందుకు కేం ద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, ఎరువుల కోసం రైతులెవరూ ఆం దోళన చెందాల్సిన పనిలేదని, వారి అవసరం మేరకే కొనుగోలు చేయాల్సిందిగా సూచించా రు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై వ్య వసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో హైద రాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అ త్యధికంగా 2022-23, యా సంగిలో 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యా వాడకం ఉందని, దానిని ప్రామాణికంగా తీసుకొని, అం తకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేటట్టు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
అక్టోబర్ 1 నుండి ఇప్పటిదాకా కేంద్రం నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా కోసం ప్రణాళికలు ఇవ్వగా, కేవలం 6.73 లక్షల మె ట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందని, ఇదే విషయాన్ని సీజన్ ఆరంభంలో కూడా కేం ద్రం ధృష్టికి తీసుకువెళ్లగా, రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు సరఫరా చేసే బాధ్యత తమదని కేంద్రం నుండి భరోసా వచ్చినప్పటికీ కేవలం ఫిబ్రవరిలోనే 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్1 న ప్రారంభ నిల్వలు 3.08 లక్షల మె ట్రిక్ టన్నులను జాగ్రత్తగా సరఫరా చేస్తూ రా ష్ట్రంలోని అందరు రైతుల అవసరాలకు తగ్గట్టు ఇప్పటిదాకా సరఫరా చేశామని అన్నారు. ఇకముందు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.30 లక్షల మెట్రిక్ టన్నులను అవసరాల మేరకు ఆయా జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు.