బస్సులో రూ 50 వేలు మరిచిపోయిన రైతు
గుర్తించి బాధితుడికి అందజేత
నల్లగొండ: రెండు వేలకు, ఐదు వేలకు ఇలా ఎంత దొరికితే..అంతే చాలు.అన్న చందాన ప్రవర్తించి,
ఆశపడే కొందరు అధికారులకు భిన్నంగా..మానవత్వాన్ని, నిజాయితిని చాటుకున్నారు ఓ అధికారి.
ఉద్యోగులకు, అధికారులకు అదర్శంగా నిలిచేలా.. అధికారి అంటే ఇలా ఉండాలి అని ఉదాహరణ గా నిలిచారు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశీల్దార్ మాచన రఘునందన్. ఆర్టీసీ బస్సు లో డబ్బు ను పోగొట్టుకున్న ఓ రైతుకు దాన్ని తిరిగి అందజేసి నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ డగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లాలోని చింతపల్లి కి ఓ రైస్ మిల్లు తనిఖీ కోసం అర్ టిసి బస్సు లో వెళ్లారు. అదే బస్సు లో చింతపల్లి మండలానికి చెందిన ఓ రైతు ఐలయ్య కూడా ప్రయాణిస్తున్నారు.
బస్సు చింత పల్లికి రాగానే సీట్లోంచి లేచి బస్సు దిగడానికి వెళ్తున్న ఐలయ్య తన డబ్బు పడిపోయిన విషయం గమనించలేదు. కంగారు, కంగారుగా బస్సు దిగేశాడు. డబ్బు పడిపోయినా కూడా పట్టించుకోకుండా బస్సు దిగి వెళ్తున్న సందర్భం లో డబ్బు కనపడక ఆందోళన కు గురయ్యాడు.. సివిల్ సప్లై డి టి రఘునందన్, ఐలయ్య కూర్చున్న సీటు కింద పడి ఉన్న ఆ డబ్బు తీసి, ఇదిగో నీ డబ్బు. జాగ్రత్త గా పెట్టుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఐలయ్య కాస్త కుదుట పడ్డాక. అంత డబ్బు ఎక్కడివి ఎక్కడినుంచి తెస్తున్నావ్ అని అడిగితే..”బిడ్డ లగ్గం ఉంది, సిటి ల తెలిసిన వారి దగ్గర జాగ కాగితాలు ఉంచి తీసుకొచ్చిన సారూ..”అని ఐలయ్య బదులిచ్చాడు. సార్.. పోయిన నా పైసలు తిరిగి ఇచ్చినవ్. ఓ వెయ్యి తీసుకో అని ఐలయ్య ప్రాధేయ పడ్డాడు. “నీకు బిడి అలవాటు ఉంది, అది మానెయ్ చాలు” అంటూ ఆన తీసుకున్నాడు.