Thursday, February 27, 2025

సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఖర్తోమ్ : సూడాన్‌లో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. వాడి వయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాప్ అయిన కాసేపటికే నివాసాల మధ్య కుప్ప కూలింది. ఈ సంఘటనలో 46 మంది సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. పదిమందికి పైగా గాయపడినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని, తెలిపారు.

ప్రమాద స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సూడాన్‌పై పట్టు కోసం సైన్యం పారామిలిటరీ రాపిడ్ సపోర్టు ఫోర్స్ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్టు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తునన ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ సంఘర్షణలకు సంబంధం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News