Thursday, February 27, 2025

కుంభమేళాకు వెళ్లని రాహుల్, థాక్రేలను బహిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే మహాకుంభమేళాను సందర్శించకుండా హిందూ సమాజాన్ని అవమానపరిచారని, అందుకు గాను హిందూఓటర్లు వారిని బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్ ఆథవదే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వారి పార్టీలకు ఓట్లేయ వద్దని సూచించారు. తరచూ సమావేశాల్లో  హిందుత్వం గురించి మాట్లాడే థాక్రే ఈ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదని మండి పడ్డారు. ఈ విషయంలో వారు కనీసం ప్రజల మనోభావాలను పరిగణన లోకి తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి , ఉద్ధవ్‌థాక్రేకు తగిన గుణపాఠం చెప్పినా, వారి తీరులో ఎటువంటి మార్పు లేదని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News