- Advertisement -
హైదరాబాద్: నటి ప్రియమణి మతాంతర వివాహనం చేసుకున్నారు. 2017లో ముస్తాఫారాజను హీరోయిన్ ప్రియమణి పెళ్లి చేసుకున్నారు. ముస్తాఫాను చేసుకోవడంతో ప్రజలను ఆమెపై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. తన భర్తతో దిగిన ఫొటో పెడితే మతాంతర వివాహంపైనే కామెంట్స్ వస్తాయని నటి వెల్లడించింది. పుట్టే పిల్లలను ఐసిస్లో చేర్చాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారని ప్రియమణి మండిపడుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని తన భర్త పెళ్లి చేసుకోవడం చెల్లుబాటు కాదని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రియమణి, ముస్తాఫారాజాపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -