Friday, February 28, 2025

మంత్రి హరీశ్‌రావుపై మరో కేసు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై మరో కేసు నమోదు అయింది. హరీశ్ రావు‌తో పాటు మరో ముగ్గురి నుంచి తనకి ప్రాణాపాయం ఉందని చక్రధర్‌ గౌడ్ అనే వ్యక్తి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు హరీశ్‌రావుపై 351(2), ఆర్‌డబ్ల్యూ 3(5) పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌తో పాటు సంతోష్‌కుమార్, రాములు, వంశీలపై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌లో ఎ-2గా హరీశ్ పేరును పోలీసులు చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News