అమరావతి: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని తెలిపారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యమని అన్నారు. 35. లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని అన్నారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ ల వినియోగిస్తున్నామని చెప్పారు.
భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నామని తెలియజేశారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలు ఉన్నాయని పేర్కొన్నారు.
48, 340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్.
అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు.
ఎరువుల స్టాక్ నిర్వహణకు రూ. 40 కోట్లు.
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ. 61 కోట్లు.
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ. 139 కోట్లు.
7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ.
డ్రోన్ల రాయితీ కోసం రూ. 80 కోట్లు.
875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు.
యాంత్రీకరణకు రూ. 219 కోట్లు.
విత్తన రాయితీ పంపిణీకి రూ. 240 కోట్లు.
రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ. 250 కోట్లు.
సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యం: అచ్చెన్నాయుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -