Thursday, March 6, 2025

సస్పెండ్ చేసినా బిసిల ఉద్యమం ఆగదు:తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

తనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా బీసీల కోసం చేయబోయే ఉద్యమం ఆగదు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తన సస్పెన్షన్‌పై బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ రెడ్డికి నన్ను సస్పెండ్ చేయించారు. సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలోంచి రేవంత్ బయటకు రావాలన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కుల గణనను తప్పుగా చూపారు. 90 ఏళ్ళ తర్వాత కుల గణన చేస్తే చపట్లు కొట్టేటోడు కూడా లేడు.. చేసిన కుల గణనపై తప్పు అని నిరూపిస్తా సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న రాహుల్ గాంధీ హామీతోనే కాంగ్రెస్‌లో చేరాను. కాంగ్రెస్ కులగణన చిత్తు కాగితంతో సమానం… 2011లో రాహుల్ గాంధీ చేసిన పనినే తాను చేసినట్లు తెలిపారు.

మన్మోహన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చించలేదా అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఒక న్యాయం.. మల్లన్నకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకు మాత్రమే అని వెల్లడించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కులగణనలో నిర్లక్ష్యంగా పాల్గొన్నారని తెలిపారు. అగ్రవర్ణాలను ఎక్కువ చూపి బీసీలను తొక్కి పెట్టారని మండిపడ్డారు. పాల్న్ ప్రకారం కాంగ్రెస్‌ను ఖతం చేసే పనిలో సీఎం రేవంత్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ప్రధాని మోదీ ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారన్నారు అని ఆరోపించారు.. మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్‌నగర్ ఎంపీలను బీజేపీ గెలవటానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. బలమైన కేసీఆర్‌తో తాను కొట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని.. రేవంత్ రెడ్డే ఓడించారన్నారు, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ తనను గెలిపించారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ కూర్చున్న సీఎం కుర్చీకి పునాది పడటానికి తాను కూడా కారణమని స్పష్టం చేశారు.

రెక్కల కష్టంతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి నా పాత్ర కూడా ఉంది. కేసీఆర్ నియంత పాలనలో కాంగ్రెస్‌కు.. నా న్యూస్ ఆఫీస్ గాంధీ భవన్‌గా మారిందన్నారు. నేను ప్రచారం చేసిన 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 42 సీట్లు గెలిచింది. రేవంత్‌కు నచ్చకున్నా 2028లో బీసీ ముఖ్యమంత్రి ఖాయం. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకు కాంగ్రెస్‌లో స్చేచ్చ లేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా.. కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరు. గౌడ్ కోటాలో జగ్గారెడ్డి సతీమణికి కార్పొరేషన్ పదవి వచ్చింది. రెడ్డిలు పప్పు, బెల్లం లెక్క కార్పొరేషన్ పదవులు పంచుకున్నారు” అంటూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సంగెం సూర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News