Thursday, March 6, 2025

మంచి కంటెంట్ సినిమాను మళ్ళీ చూద్దామని వస్తున్నారు

- Advertisement -
- Advertisement -

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మార్చి7న రీ రిలీజ్ చేస్తున్నాం. అప్పుడే పది థియేటర్లు ఫుల్ అయ్యాయి. మహేష్, వెంకటేష్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది”అని అన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. మంచి కంటెంట్ సినిమాలను మళ్ళీ చూద్దామని ప్రేక్షకులు వస్తున్నారు… మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు నిరూపిస్తున్నాయని తెలిపారు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ వున్నా సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా డబ్బు వచ్చేది. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబంధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పటికే ఓటీటీ లో వుంది. జనం చూసేశారు. అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్‌కి సినిమా వస్తే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్‌తో ఎల్లమ్మ.. ఈ రెండు సినిమాలు చేయబోతున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News