బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తాజాగా ముంబైలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా యష్ రణబీర్ కపూర్లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఇక, తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే ప్రారంభించనున్నారు. ఆ షెడ్యూల్లో యష్తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలిసింది. ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్గా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది.