శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్లో ఎయిర్పోర్టు సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి అవార్డు దక్కింది. 2024 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణీకులతో బెస్ట్ ఎయిర్పోర్టుగా శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టు ప్యాసెంజర్స్ సంతృప్తికర స్థాయిని కొలవడానికి బెంచ్ మార్క్గా పరిగణిస్తారు.
ఇది విమానాశ్రయాల పరిమాణం, ప్రాంతం, డెడికేటెడ్ స్టాఫ్, ఈజీఎస్ట్ ఎయిర్పోర్టు జర్నీ, డెడికేటెడ్ స్టాఫ్, ఎంజాయబుల్, క్లీనెస్ట్ ఎయిర్పోర్టు వంటి అంశాల ఆధారంగా ఎయిర్పోర్టుకి ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ అవార్డు రావడం పట్ల శంషాబాద్ ఎయిర్పోర్టు సిఇఒ ప్రదీప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎయిర్పోర్టుకి బెస్ట్ రేటింగ్స్ ఇస్తున్న పాసెంజర్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటామని, అధునాతన టెక్నాలజీని, ఇన్నోవేషన్స్ని అందిపుచ్చుకుంటూ ప్రయాణీకులకు టెస్ట్ మెమొరీస్ ఇవ్వడమే తమ లక్షమని సిఇఒ ప్రదీప్ అన్నారు.