- Advertisement -
సినీ నటుడు, రచయిత, వైసిపి నేత పోసాని కృష్ణమురళికి నరసారావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయనను సోమవారం నరసా రావుపేట కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది నవంబరులో నరసారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసాని కృష్ణ మురళిపై తెలుగు దేశం పార్టీ నాయకుడు కొట్టా కిరణ్ ఫిర్యాదు చేశారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశా రని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
- Advertisement -