Wednesday, March 12, 2025

రైలును హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. ఆరుగురు సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

బలోచిస్థాన్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. హైజాక్ చేసిన సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దాడికి వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) బాధ్యత తీసుకుంది.

ముందుగా ట్రాక్‌ను పేల్చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత రైలుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు బిఎల్‌ఎ వెల్లడించింది. ఆ తర్వాత రైలును తమ నియంత్రణలోకి తీసుకుంది. ప్రయాణికులతో పాటు కొందరు భద్రతా సిబ్బంది కూడా రైలులో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారు. ఎలాంటి మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నించినా.. అందరిని చంపేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. సహాయక, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News