Wednesday, March 12, 2025

టిటిడి దర్శనాలకు తెలంగాణ మంత్రుల, ఎంపిల సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

టిటిడి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి
ఎపి సిఎం చంద్రబాబుకి లేఖ రాసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: టిటిడి దర్శనాలపై ఎపి సిఎం చంద్రబాబుకి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాసింది. టిటిడి అధికారులు ఎపి ముఖ్యమంత్రి ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదని చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, తిరుమల వేంకటేశ్వరుడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కొండా సురేఖ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. టిటిడి అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని ఎపి సిఎం చంద్రబాబు దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఎపి సిఎం చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఎపి ముఖ్యమంత్రి సత్వరమే చర్యలు తీసుకోవాలని లేఖలో మంత్రి సురేఖ కోరారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి సురేఖ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఉపయోగపడుతుందని, వారి తరపున తాను ఎపి సిఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఎపి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు తిరుపతి దేవుడి దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించబడినందుకు తాము సంతోషంగా ఉన్నామని, వాటిని టిటిడి అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఎపి సిఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News