Thursday, March 13, 2025

నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా ర్యాలీ

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను ప్రదర్శించారు. యోగి నేపాల్‌లో రాచరికానికి బలమైన మద్దతుదారు కావడమే ఇందుకు కారణం. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించి జ్ఞానేంద్ర షా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. నేపాల్‌లో రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. నేపాల్‌లో రాచరిక పాలను పునరుద్ధరించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమయంలో జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను ప్రదర్శించారు. ఇతర దేశాల నేతల చిత్రపటాలను ప్రదర్శించడంపై విమర్శలు రావడంతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. తమ ఉద్యమానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రధాని కెపి ఓలి వర్గం ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు సూచనల మేరకు యోగి చిత్రాన్ని ప్రదర్శించారని ఆ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ప్రధాని ఓలి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News