Saturday, March 15, 2025

తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం: ఎంపి రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సమస్యలు తప్పడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైంది. టిటిడి మాత్రం ఎపి సిఎం చంద్రబాబు ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు. తిరుమలలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెదక్ ఎంపి రఘునందన్‌రావు, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇదే అంశంపై మాట్లాడారు. టిటిడి చైర్మన్ చొరవ చూపాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమ లలో పట్టించుకోవడం లేదు అని బిజెపి ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యా నించారు. తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం రఘునందన్ రావు పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎంపి, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎలు ఇచ్చే సిఫార్సులను తిరుమ లలో తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలవుతుందని ఎపి ప్రభుత్వం, టిటిడి సైతం తెలిపింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎంఎల్‌ఎల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి అనుమతి ఇచ్చేవారు. కానీ రాష్ట్ర విభజన నుంచి తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మారిపో యాయి. తిరుమలలో కేవలం ఎపి ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టిటిడి పరిగణనలోకి తీసుకుంటుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సులను ఆమోదిస్తామని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు సైతం చెప్పారు. లేఖలు ఇవ్వండి, అకామడేషన్ ఇస్తామంటారు. లేఖలు సిఫార్సు చేస్తే పరిగణనలోకి తీసుకోవడం లేదు. మార్చి నెల సగం పూర్తయింది. ఇంకా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలతో వచ్చే వారికి ఎలాంటి అనుమతి, సదుపాయాలు కల్పించడం లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఉమ్మడి ఎపిలో 294 మంది సిఫార్సు లేఖలు ఆమోదిం చిన టిటిడి ఇప్పుడు కేవలం ఎపి నేతల లేఖల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి’ అని ఎంపీ రఘునందన్ రావు కోరారు. వేసవి సెలవులలో వచ్చే భక్తులకు తాము సిఫారసు లేఖలు ఇస్తామని, తీసు కోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధుల మంతా తిరుమ లకు వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ ఎంఎల్‌ఎ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను అనుమతించే విధంగా టిటిడి చైర్మన్ ఇఒ, అడిషినల్ ఇఒ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రెండ్రోజుల కిందట తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై చంద్రబాబుకు లేఖ రాశారు. టిటిడి అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని సదరు లేఖలో పేర్కొన్నారు అధికారుల తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి సిఎం ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్జప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎంఎల్‌ఎ, ఎంపిల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టిటిడి బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు.

తాజాగా టిటిడి బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది. వారి డిమాండ్ మేరకు గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సిఎం చంద్రబాబు అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ సిఎంకి స్వయంగా చంద్రబాబు లేఖ రాశారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు

. ప్రతి ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపీ నుంచి ప్రతి వారం ఏదైనా రెండు రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనం కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ కొరకు రెండు లేఖలు స్వీకరి స్తామని స్పష్టం చేశారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు వెల్లడించారు. అయితే ఈ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు అసంతృప్తికి గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News