Tuesday, March 18, 2025

డీలిమిటేషన్‌కు శాస్త్రీయత

- Advertisement -
- Advertisement -

ఒక విధానాన్ని కనుగొనే వరకు
నియోజకవర్గాల పునర్విభజనను
వాయిదా వేయాలి ప్రస్తుత పద్ధతితో
తెలంగాణకు తీరని నష్టం కేంద్రంలో
దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం
కావాలి జాతీయ పార్టీలు ఒక
పాలసీ తీసుకురావాలి అఖిలపక్ష
సమావేశంలో ఆయా పార్టీల అభిప్రాయం
బిజెపి, బిఆర్‌ఎస్ గైర్హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం గా ఉండేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనపై సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్, రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణా ది రాష్ట్రాలు, వాటిలో ప్రధానంగా తెలంగాణ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై విస్తృతంగా చర్చలు, ఆలోచనలు చేయాలని సమావేశానికి హా జరైన రాజకీయ పక్షాలకు ఉపముఖ్యమంత్రి కో రారు. మన గౌరవం, ప్రాధాన్యత కాపాడుకుంటూ భారత దేశంలో మనందరి పాత్ర ఉండాలని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయ న తెలిపారు.

అఖిలపక్ష సమావేశానికి బిఆర్‌ఎస్ నేతలను కూడా ఆహ్వానించినప్పటికీ వారు ప్రత్యే క రాజకీయ కారణాల తో సమావేశానికి హాజరు కాలేమని చెప్పారని ఆయన వివరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశంలో బిజీగా ఉండడంతో పాటు ప్రత్యేక రాజకీ య పరిస్థితుల నేపథ్యంలో హాజరు కాలేదన్నా రు. సమావేశానికి హాజరైన నాయకులు ఇచ్చిన స మాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఏవిధంగా ముందుకు వెళ్లాలనే ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాసనసభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేం ద్రానికి పంపించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఆందోళనలకు దారితీయకుండా మరికొంతకాలం ఇదే విధానం కొనసాగించాలని, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉందన్న స్పృహ వారికి కలగజేయాలిని సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఒక శాస్త్రీయపరమైన నిర్ణయం వచ్చేవరకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి అనుగుణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాలని సిపిఐ శాసనసభ పక్ష నేత కె. సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ అంశంపై పోరాటం చేస్తూ మరోవైపు సైంటిఫిక్ పరిష్కారం కోసం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు నిత్యం ఆలోచన చేయాలని కూనంనేని, వెస్లీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నియోజకవర్గ పునర్విభజనపై జాతీయస్థాయిలో ఒక పాలసీని తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్టేట్ అంటే ప్రతి రాష్ట్రానికి సమాన హక్కు ఉండాలి, నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని సిపిఎం మాస్ లైన్ నేత హనుమేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతం ప్రకారం దక్షిణాదిలోను నియోజకవర్గం పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ప్రాథమిక సమావేశమేనని రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ అంశంపై చర్చ, కార్యక్రమాలు చేపట్టాలని అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్న ఆచరణలో పెట్టేందుకు సిద్ధమని సమావేశానికి హాజరైన పార్టీల నేతలు తెలిపారు. సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఎంఐఎం శాసనసభక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు హనుమేష్, సూర్యం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, నెల్లికంటి సత్యం, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి సిహెచ్.బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బి.మహేష్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News