- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా నందలూరులో కండక్టర్ పై యువకులు దాడి చేశారు. రాజంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తుండగా నందలూరు వద్ద ఆపి ఆన్ డ్యూటీలో ఉన్న కండక్టర్ పై పిడిగుద్దులు కురిపించారు. కండక్టర్, బస్సు డ్రైవర్ ను దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
- Advertisement -