ఉ.9.30 నుంచి మ.12.30 వరకు
ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్
ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై
క్యూఆర్ కోడ్ ఎలక్ట్రానిక్
పరికరాలు నిషేధం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం(మార్చి 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతా యి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండ గా, వారిలో 2,58,895 బాలురు, 2,50,508 బాలికలు ఉన్నారు. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఈ పరీక్షల కోసం 2650 మంది ఛీఫ్ సూపరిడెంటెండెంట్లు, 2650 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థుల కోసం 040 23230942 ఫోన్ నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల ప్రారంభానికి ఒకటి రెండు రోజుల ముందు పరీక్షా కేంద్రాలను సందర్శించాలని సూచించించింది. అన్ని పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్లను నియమించారు. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి ఉండదు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదు. హాల్టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, పెన్ పెన్సిల్, షార్ప్నర్, ఎరాయిజర్, జామెట్రిక్ పరికరాలతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ పరీక్షలో ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. పరీక్ష జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలు మూసివేసేలా అధికారులు చర్యలు చర్యలు తీసుకున్నారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. పరీక్ష విధుల్లో ఉండే అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు వాడకూడదని అధికారులు తెలిపారు. పది పరీక్ష విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఫొటో గుర్తింను కార్డు ధరించాలి. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బందిని పరీక్ష ముగిసే వరకు బయటకి వెళ్లేందుకు అనుమతించరు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ సబంధించిన ఎటువంటి పరికరాలు పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురాకూడదని తెలిపారు.
వెబ్సైట్లో హాల్ టికెట్లు
పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు తెలిపారు. హాల్ టికెట్లను డిఇఒల ద్వారా పాఠశాలలకు పంపించామని, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు పొందాలని తెలిపారు. వివిధ కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులకు సూచనలు
—- సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటల సమయానికి పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళితే హడావుడిగా ఉండి పరీక్షలు సరిగ్గా రాయలేకపోవచ్చు.
– విద్యార్థులు హాల్ టికెట్, రైటింగ్ప్యాడ్, అవసరమైన పెన్నులు, ఎరాయిజర్,పెన్సిల్ తీసుకెళ్లాలి.
— విద్యార్థులు తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చుకోవాలి
—- ప్రశ్నపత్రంపై విద్యార్థి తన హాల్టికెట్ నెంబర్ రాయాలి.
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు.
అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరికి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి ఉండదు.
—- -www.dse.telangana.gov.in వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చు.