Thursday, April 17, 2025

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది.  ఇక, గురువారం శ్రీవారిని 58,864 మంది భక్తులు దర్శించుకున్నారు.  25,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News