- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 10 గంటల సమయం పడుతుంది. ఇక, బుధవారం తిరుమల వెంకన్నను 62,076 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,699 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.27 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -