Monday, April 28, 2025

2025లో రూ. 102.9 బిలియన్లు నమోదు చేసిన సిగ్నేచర్ గ్లోబల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన సిగ్నేచర్ గ్లోబల్ (BSE: 543990|NSE: SIGNATURE), గత ఆర్థిక సంవత్సరం (2025)లో అత్యధిక వార్షిక ప్రీ-సేల్స్ రూ. 102.9 బిలియన్ నమోదు చేసినట్లు వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2025 లో ఇయర్ ఆన్ ఇయర్ 42% బలమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్ విశ్వాసం, సకాలంలో పూర్తి చేయటం , గురుగ్రామ్ , పరిసర మార్కెట్లలో విజయవంతమైన కొత్త ప్రారంభాల ద్వారా కంపెనీ రికార్డు స్థాయిలో రూ. 43.8 బిలియన్ల వార్షిక కలెక్షన్ లను సాధించింది, ఇది ఇయర్ ఆన్ ఇయర్ 41% పెరుగుదలను సూచిస్తుంది.

కంపెనీ పనితీరుపై చైర్మన్, హోల్-టైమ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, “మేము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించి, ఆర్థిక సంవత్సరం 2025ని ఉన్నతంగా ముగించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ విజయం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, మా గృహ కొనుగోలుదారులు, ఛానెల్ భాగస్వాములు మరియు వాటాదారులు మాపై ఉంచిన లోతైన నమ్మకానికి నిదర్శనం. మార్కెట్ ట్రెండ్‌లను అంచనా వేయడం, అధిక-సంభావ్య సూక్ష్మ-మార్కెట్లలో సైతం సకాలంలో ప్రాజెక్టులను ప్రారంభించడం, ప్రీమియం, మధ్య-ఆదాయ విభాగాలలో స్థిరంగా విలువను అందించడం వంటి మా సామర్థ్యం ఈ వృద్ధికి కేంద్రంగా ఉంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News