- Advertisement -
హైదరాబాద్: నెక్లస్ రోడ్డు వద్ద జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నామని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కార్వాన్ లో ఫూలే జయంతి వేడుకల్లో కవిత పాల్గొని, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఫూలే విగ్రహ ఏర్పాటుకు సిఎం రేవంత్ రెడ్డి స్థల పరిశీలన చేశారనే విషయం తెలిసిందని అన్నారు. ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలని, విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.
- Advertisement -