Wednesday, April 16, 2025

వక్ఫ్‌ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం: ఎంపి అసదుద్దీన్ ఒవైసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధంగా ఉందని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు. ఈ నెల 19న వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనల తెలిపాలని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగే నిరసనలో తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. వక్ఫ్‌ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని దుయ్యబట్టారు. ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. వక్ఫ్‌ అంటేనే తన దృష్టిలో ఓ ప్రార్థనా స్థలం అని ఎపి అసదుద్దీన్ ఒవైసి తెలియజేశారు.

వక్ఫ్‌ బిల్లుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ మద్దతిచ్చారని మండిపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్‌ 26కు విఘాతం కలుగుతోందని, వక్ఫ్‌పై బిజెపి చెప్పేవన్నీ అబద్ధాలేనని, వక్ఫ్‌ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వక్ఫ్‌ బిల్లుపై మోదీ మరోసారి ఆలోచన చేయాలని ఎపి అసదుద్దీన్ ఒవైసి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News