Sunday, April 27, 2025

టిజిఐఎస్‌సికి భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా?

- Advertisement -
- Advertisement -

టిజిఐఎస్‌సి బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ వద్ద అప్పు తీసుకోలేదా?
ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొని రుణం తీసుకున్న మాట వాస్తవం కాదా..?
మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను తప్పు దోవ పట్టించేలా మాట్లాడారు
: ప్రభుత్వంపై బిజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా హెచ్‌సియూ భూముల వ్యవహారంలో రుణం తీసుకున్న అంశంపై ఇచ్చిన వివరణ ఉందని బిజేపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిజిఐఎస్‌సికి ఈ భూములు ఇచ్చిన మాట వాస్తవం కాదా?, టిజిఐఎస్‌సి బాండ్ల రూపంలో ఐసిఐసి వద్ద అప్పు తెచ్చిందా లేదా?, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొని రుణం తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి నేరుగా రుణాలు తీసుకుంటే ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి రాకుండా టిజిఐఎస్‌సి ద్వారా రుణాలు తెచ్చారని ఆరోపించారు.

రుణం తీసుకరావడానికి రూ.170 కోట్లు కమిషన్ ఇచ్చారా లేదా? అనేదానిపై స్పష్టత లేదని అన్నారు. నిన్న కాక మొన్న కూడా రెండు వేల బాండ్స్ ద్వారా లోన్స్ తెచ్చారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు రూ.170 కోట్ల కమీషన్ ఎలా ఇచ్చారో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, వెంటనే శ్రీధర్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం ఏ పని చేయకుండా 10 వేల కోట్ల రూపాయలు ఇచ్చారంటున్న మంత్రి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి అసెంబ్లీలో హెచ్‌సియూ భూముల్లో గుంట నక్కలు ఉన్నారని చెప్పారే తప్ప వారు ఎవరో చెప్పడం లేదని అన్నారు. సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు కేవలం బట్ట గాల్చి మీద వేయడానికి బిజెపి ఎంపీ ఉన్నారని చెబుతున్నారని అన్నారు. ఒక వేళ అదే నిజమైతే ఇంత వరకు ఎందుకు ఆ పేరు చెప్పలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్రాస్ చీకటి ఒప్పందంలో భాగంగానే రెండు పార్టీలు బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. బిజెపి చేసే పోరాటం చూసి రెండు పార్టీలు తమపై ఆరోపణ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో హెచ్‌సియూ కాదు ఏ భూమి అమ్మడానికి వీలులేదని, భూముల అమ్మకంపై ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడుతుందని ఏలేటి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News