- Advertisement -
అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ సౌకర్యంతో పాటు, యాత్రికుల ముందస్తు నమోదు కోసం దేశవ్యాప్తంగా పిఎన్ బి, ఎస్ బిఐ, జమ్మూకశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లతో సహా మొత్తం 540 బ్రాంచులను అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నియమించింది. దీంతో అమర్నాథ్ మందిరాన్ని సందర్శించడానికి యాత్రికుల మొదటి బ్యాచ్లో చోటు దక్కించుకోవాలనే ఆశతో జమ్మూలో ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో నిలబడ్డారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9న ముగియనుంది.
- Advertisement -