- Advertisement -
అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మంగళవారం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఎసిబి అధికారులకు చిక్కారు. దీంతో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆయనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
- Advertisement -