పొరపాటు జరిగిందన్న ఐడిఎఫ్
గాజా సరిహద్దుకు రెండు మైళ్ల దూరంలో పడిన బాంబు
టెక్నికల్ మాల్ఫంక్షన్ వల్లేనని సైన్యం ప్రకటన
గాజా : గాజా స్ట్రిప్లోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తున్న విషయం విదితమే. హమాస్ను తుడిచిపెట్టడమే తమ లక్షమని, అప్పటి వరకు గాజాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం గాజా స్ట్రిప్పై దాడికి బయలుదేరిన ఒక ఫైటర్జెట్ పొరపాటుప ఇజ్రాయెల్ భూభాగంపైనే బాంబు జార విడిచింది. దక్షిణ గాజా సరిహద్దుకు రెండు మైళ్ల ఇవతల నిర్ యిత్ఝాక్ అనే ప్రాంతంలో క్షిపణి దాడి జరిగింది.
అయితే, ఈ క్షిపణి మైదాన ప్రాంతంలో పడడంతో ప్రాణ నష్టం తప్పిందని, పౌరులు ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. టెక్నికల మాల్ఫంక్షన్ వల్లే ఈ పొరపాటు చోటు చేసుకుందని ఐడిఎఫ్ వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం నిర్ యిత్ఝాక్ ప్రాంతంలో సుమారు 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధాని నెతన్యాహు ఉత్తర గాజాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పొరపాటు జరగడం గమనార్హం.