- Advertisement -
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీసుధ.. కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ కె.సురేందర్.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -