Tuesday, April 22, 2025

మహేష్‌బాబుకు ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసేందుకు హీరో మహేష్ బాబు రూ3.4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఇడి అధికారులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ ప్లూయెన్స్ చేశారని అభియోగాలు కూడా మోపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News