Friday, April 25, 2025

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

తొమ్మండుగురు మృతి పలువురికి గాయాలు

కీవ్: ఈస్టర్ విరామం తరువాత రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్‌పై తిరిగి భీకర దాడికి దిగాయి. రాజధాని కీవ్‌ల గంటల తరబడి సాగిన క్షిపణుల దాడిలో కనీసం తొమ్మండుగురు మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా మారింది. త్వరలోనే శాంతి చర్చలు జరిగే నేపథ్యంలో ఇంతటి భీకర స్థాయి దాడులు జరగడం జులై ఘటన తరువాత ఇదే తొలిసారి. రష్యా బలగాలు తెరిపి లేకుండా సాగించిన క్షిపణుల దాడి క్రమంలో నగర పౌరులు తల్లడిల్లారు. బయటకు రాలేక, ఇండ్లలో ఉండలేక వారి పరిస్థితి అగమ్య గోచరం అయింది.

దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్న అధ్యక్షులు జెలెన్‌స్కీ వెంటనే స్వదేశం తిరిగి వచ్చారు. రష్యా అత్యంత క్రూర రీతిలో వ్యవహరించిందని, సాధారణ పౌరులను 11 గంటల పాటు బందీలను చేసిందని వ్యాఖ్యానించారు. నగర మేయర్ విటలి క్లిస్చ్‌కో స్పందిస్తూ , బాధిత కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నామని, శుక్రవారం అధికారికంగా సంతాప దినం పాటిస్తారని వివరించారు.రష్యా వైమానికి బలగాలు ఈసారి ఏకంగా 66 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇతరత్రా మారణాయధాలతో కూడా నివాసిత ప్రాంతాలపై విరుచుకుపడిదంని చెప్పారు.

దాడుల దశలో జెలెన్‌స్కీ ప్రిటోరియాలో ఉన్నారు, దాడి సమాచారం తెలియగానే స్వదేశానికి బయలుదేరి వచ్చారు. జెలెన్‌స్కీపై ఇటీవలే అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యాతో యుద్ధ విరమణ జరుగకుండా జెలెన్‌స్కీ తప్పించుకు తిరుగుతున్నాడని , పైగా దీనికి పలు కారణాలు చూపుతున్నాడని. దీర్ఘకాలిక యుద్ధం వల్ల ఎవరికీ ప్రయోజనం? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై జెలెన్‌స్కీ ఎటువంటి స్పందన వెలువరించలేదు. కాగా ఇరుపక్షాలతో సంప్రదింపుల విషయంలో ట్రంప్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. రష్యా అధ్యక్షులు పుతిన్‌తో ఈ మేరకు ఇప్పటికే సమగ్ర చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News