Friday, April 25, 2025

గోపీచంద్‌తో ఎస్‌విసిసి సినిమా ఆరంభం

- Advertisement -
- Advertisement -

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఓ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం నాడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌దత్ ఐఎస్‌సి కూడా ఈ టీంలో చేరారు. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News