Sunday, April 27, 2025

కెటిఆర్ పై ఫిర్యాదు.. తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు

- Advertisement -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిలు నకిలీ వీడియోలను విడుదల చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది మే 25న వారిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కెటిఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టగా.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కెటిఆర్, జగదీశ్ రెడ్డిలు వ్యాఖ్యలు చేయలేదని.. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కేసు నమోదు చేశారని..కాబట్టి ఈ కేసును కొట్టివేయాలని పిటిషనర్ల తరఫున న్యాయ వాది వాదనలు వినిపించారు. దీంతో పోలీసులు, తీన్మార్ మల్లన్నకు కోర్టు నోటీసులు జారీ చేసిందది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 13కు హైకోర్టు వాయిదా వేసింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News