- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరో హత్య జరిగింది.సిటీలో హిమాయత్నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్టులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. భవనంలోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మధ్యమండల డీసీపీ శిల్పవల్లి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -