ఎ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్
హైదరాబాద్: ఉద్యోగం తో పాటు సామాజిక బాధ్యత పట్ల సైతం కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మాచన రఘునందన్ పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్..ఉద్యోగం చేస్తూనే.. ఉద్యోగుల సమస్యల పై జాతీయ స్థాయిలో గళం విప్పుతున్నారు. ఉద్యోగుల కు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు కోసం దేశ రాజధాని లో జాతీయ సమావేశాల్లో హిందీ , ఇంగ్లీష్ లో మాచన రఘునందన్ అనర్గళంగా మాట్లాడారు. “మాచన” యోగ్యత కు జాతీయ స్థాయి భాద్యత దక్కింది. న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం.. కదం తొక్కుతున్న ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్) మాచన రఘునందన్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది… ఈ సందర్భంగా “మాచన” సోమవారం నాడు రోమింగ్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.. భాగస్యామ్య పింఛను పథకం, ఉద్యోగుల పాలిట ఓ టెన్షన్ స్కీమ్ అని, ఉద్యోగులు సి పి ఎస్ ను ఎందుకు వద్దు అనుకుంటున్నారో.. ఆయన మాటల్లోనే..
సిపిఎస్ అని క్లుప్తంగా పిలుచుకున్నా.. ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అర్థం అయ్యేలా చెప్పినా, భాగస్వామ్య పింఛను పథకాన్ని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది మాత్రం సెప్టెంబర్ 1 2004 నుంచి పంద్రాగస్టు, అక్టోబరు 2 వ తేదీ వీటిని అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఆయా రోజుల విశిష్టత అది. అలాగే .. సెప్టెంబర్ 1 కూడా ఉద్యోగులను మరవనివ్వకుండా చేసింది. తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం పోయిందన్న వ్యధ మిగిల్చింది. ఉద్యోగం ఒక యోగం, ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. నౌకరీ ఉన్నదన్న ధీమా తో పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిణమించింది. సిపిఎస్ఓ కంత్రీ స్కీమ్ అని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భావించెలా ఆలోచనాగ్నిని రగిలించింది. ఉద్యమాన్నే రాజేసింది. అలాగే మాకు పింఛను రాదు, సర్వీసులో ఉన్నన్నాల్లూ జీతం, ఆ తర్వాత పెన్షన్ ఇక జీవితం టెన్షన్ లేని జీవనం అన్నది జన సామాన్యం అభిప్రాయం. పాలకులు, ప్రభుత్వాలు, ఎలా ఆలోచించారో ఎమో కాని , ప్రశాంతంగా ఉన్న ఉద్యోగం ల పెన్షన్ రాదు అన్న టెన్షన్ కు తెర తీసింది 2004 సెప్టెంబర్ 1.
ఆనాటి నుంచి గవర్నమెంటు ఉద్యోగంలో చేరిన వారికి పింఛను భరోసాకు భంగం అసంతృప్తిని కల్గించెలా. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడే ఇసిపిఎస్ కు పాలకులు ఎస్ అన్నపటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడెపుడు నో అంటారా అని సర్కారు వేతన జీవులు ఆబగా ఎదురు చూస్తున్నారు. సిపిఎస్ వద్దు ఒపిఎస్ ముద్దు అని నినదిస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పక్షాలు కూడా ఉద్యోగ వర్గాల పక్షాన ఉన్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొనే లా ఉద్యోగం ఉద్యమ రూపం దాల్చింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా సిపిఎస్ రద్దు కోసం ఆలోచించే లా వాతావ”రణం” పరిస్థితి నెలకొంది. సిపిఎస్ ను ఎలాగైనా రద్దు చేస్తారేమో అన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఎజెండాలో సిపిఎస్ రద్దును ఓ ప్రధాన అంశంగా చేర్చేలా ఆయా పార్టీల కు విజ్ఞాపనలు చెయ్యడం జరిగింది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఎన్ని ఉన్నా.. సిపిఎస్ రద్దు ఎకైక ఎజెండా గా పోరాడెలా అందరినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులకు కాస్తో..కూస్తో టెన్షన్ కల్గించి, అటెన్షన్ ఇవ్వక తప్పని పరిస్థితి దాపురించెలా చేసిందీ సిపిఎస్ పథకమే’ అని మాచన తెలిపారు.
‘సిపిఎస్ లో ఉన్న ఉద్యోగి మరణిస్తే.. అతని ప్రాన్ ఖాతా లో జమ అయి ఉన్న అతి కొద్ది నామ మాత్రపు మొత్తం మాత్రమే కుటుంబానికి అందుతుంది.అన్న పాయింటును అర్థం చేయించడానికి హైదరాబాద్ వేదికగా ఎన్నో సమావేశాలు, సభలూ వర్క్ షాపులు జరిగాయి’ అని పేర్కొన్నారు.
‘అయ్యా..మా మొర దయ చేసి ఆలకించరా.? మేము సి పి ఎస్ వల్ల ఆర్థిక అన్యాయానికి గురవుతున్నాo వినండి అని ఖైరతాబాద్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ లో ఓ మేధో మథనం వంటి సమావేశాన్ని నిర్వహించాము. మా.. బాధ, వ్యధ ను అర్థం చేసుకోండి సార్ అంటూ వినమ్రంగా విన్నవించడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాల్లో ఆనందం నింపండి ప్రభో.. అంటూ వేడుకున్నాం. అన్నీ తెలిసిన అంతర్యామి కి తెలియని విషయం ఒకటి ఉంటుందా..సిపిఎస్ కోసం ఉద్యోగంతో పాటు ఉద్యమం చేసి, చేసి ఇక అంతిమంగా సామాజిక మాధ్యమం ద్వారా విన్నపాలను..కేంద్ర, రాష్ట్ర పాలకులకు సోషల్ మీడియా సాయంతో సాధ్యమైనన్ని ట్వీట్లు ఉద్యమ స్పూర్తి తో పెట్టడం ద్వారా మరో మారు పాలకులకు “సిపిఎస్ రద్ధ్ కరో” అని నినాదం చేరేలా ప్రయత్నం చేస్తున్నాo. పాత పెన్షన్ పద్దతి పునరుద్దరణ అనేది ప్రతీ ఉద్యోగి హృదయ ఘోష. భాగస్వామ్య పింఛను పథకం, న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం మే నెల లో ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జాతీయ స్థాయి సమావేశం నిర్వహించి, ఆ తదుపరి కొత్త డిల్లి లో ప్రధాని తో సమావేశం జరగనుంది’ అని వివరించారు.