Tuesday, September 17, 2024

భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ శివారులో రైలు పట్టాలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లోనే వాటిని ఆపేశారు. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కు వరదనీటి ముప్పు ఏర్పడ్డంతో పందిళ్లపల్లి వద్ద మహబూబ్ నగర్-విశాఖ ఎక్స్ ప్రెస్ ను నిలిపేశారు. విజయవాడ-కాజీపేట మార్గంలో కూడా వరద నీటి కారణంగా 41 రైళ్లను నిలిపేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News