Tuesday, September 17, 2024

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో చేపల వేటకు వెళ్ళి వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన నిజాం సాగర్ మండలం నర్సింగ్ రావ్ పల్లి నల్ల వాగు మత్తడి లో చోటు చేసుకుంది. పిట్లం గ్రామానికి చెందిన జంగం కృష్ణ గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News