Tuesday, September 24, 2024

మొబైల్ ఫోన్ కొని పార్టీ ఇవ్వనందుకు కత్తిపోట్లకు యువకుడు బలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త ఫోన్ కొని పార్టీ ఇవ్వనందుకు అతడి స్నేహితులే అతడిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోనిక షకర్ పూర్ ప్రాంతానికి చెందిన సచిన్(16) అనే యువకుడు మంగళవారం కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలుచేశాడు. పార్టీ ఇవ్వాలని అతడి ఫ్రెండ్స్ డిమాండ్ చేశారు. దానికతడు నిరాకరించాడు. డబ్బులు లేవని అన్నాడు. ఆ తర్వాత మాటామాటా పెరిగి కత్తి పోట్లకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News