బిఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎంఎల్ఎ షకీల్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. గతంలో ఆయనపై పలు కేసుల్లో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా గత కొన్ని రోజులుగా ఆయన దుబాయ్లో ఉంటు న్నారు. తల్లి అంత్యక్రియల కోసం గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొ నేందుకు అనుమతి ఇచ్చారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న షకీల్ కేసులు నమోదు అయినప్పటి నుంచి దుబాయ్లో ఉంటున్నారు. తెలంగాణలో ప్రభు త్వం మారిన తర్వాత ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. వాటిలో అరెస్టు తప్పదని గ్రహించి దుబాయ్ వెళ్లిపోయారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన షకీల్ను రప్పించలేకపోయారు. అయితే ఇంతలో అనారోగ్యంతో తల్లి మృతి చెందారు. షకీల్ రాక తప్పలేదు.
వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు కూడా హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. షకీల్ కుమారుడు రాహిల్ ఆమిర్ 2022లో జూబ్లీహిల్ జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో శిశువు చనిపోయాడు. తర్వాత 2023 డిసెంబర్లో కూడా అలాంటి ప్రమాదం జరిగింది. ప్రజాభవన్ ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీ కొట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమో దు చేసి విచారిస్తే సంబంధం లేని వ్యక్తులను అందులో ఇరికించేందుకు యత్నించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులతో కుమ్మక్కై అతన్ని తప్పించారని విచారణలో తేలింది. హిట్ అండ్ రన్ కేసులో కుమారుడిని తప్పించడంలో షకీల్దే కీలక పాత్ర అని పోలీసులు అనుమానించారు. ఈ దిశగానే కేసును విచారించారు.
కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆయన పాత్రను నిర్ధారించారు. కేసు నమోదై విచారణ సాగతున్న సమయంలోనే షకీల్ కూడా దుబాయ్ పారియారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తండ్రీకుమారుడు దుబా య్లో తలదాచుకున్నారు. షకీల్ పూర్తి పేరు మొహమ్మద్ షకీల్ ఆమిర్. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 2014, 2018 రెండుసార్లు ఎంఎల్ఎగా పని చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రం అదే సుదర్శన రెడ్డి చేతిలో ఓట మిపాలయ్యారు.